కబ్జాదారులకు అండగా నిలుస్తున్న రెవిన్యూ, పోలీస్, వైసిపి నాయకులు

రైల్వేకోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతoశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో మైసూర్ వారి పల్లి పంచాయతీ పరిధిలోని స్థలం పైన జరుగుతున్న వివాదానికి సంబంధించి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. రెవిన్యూ , పోలీస్, వైసిపి నాయకులు ఉమ్మడిగా కలిసి స్థలాన్ని కబ్జా చేసే కబ్జాదారులకు తమ పూర్తి సహాయ సహకారాలు అందించడం తీవ్ర విచారకరమైన విషయం అని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులకు చట్టబద్ధంగా లీగల్ నోటీసులు అందిస్తామని వారు చేసే దుర్మార్గపు విచారణను అడ్డుకుంటామన్నారు. మైసూర్ వారి పల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త మాట్లాడుతూ.. కడప జిల్లాలో జనసేన పార్టీ సపోర్టుతో గెలిచిన ఏకైక పంచాయతీ సర్పంచ్ మరియు స్త్రీ అయిన నన్ను… ఏమాత్రం జాలి లేకుండా రాత్రి 9 వరకు స్టేషన్లో ఉంచారు అన్నారు. పంచాయతీ అనుమతులు ఏమాత్రం తీసుకోకుండా జరిగే నిర్మాణాలను అడ్డుకుంటే పోలీసులు తమపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.. గూండాలతో వైసీపీ నాయకులతో కలిసి కబ్జాదారులు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. మండల రెవెన్యూ అధికారి దీనిపై తాను స్పందించలేనని సమస్య కోర్టులో ఉంది అని చేతులెత్తేశారు. తక్షణమే సమస్య పై ఉన్నత అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, వరికూటి నాగరాజు, ఆలం రమేష్, వీరు రాయలు, అనంత రాయలు, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.