స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలసి రోడ్లు వేసిన: గాదె

ప్రత్తిపాడు, స్వాత్రంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను మండలంలో కొల్లిమర్ల గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆ గ్రామంలో ఉన్న పిల్లలు ప్రతి రోజు స్కూలుకి వెళ్లే రోడ్ గుంతల మయంగా మారి పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు వేస్తే కొల్లిమర గ్రామం నుండి గుంటూరుకి రావడానికి దగ్గరగా ఉంటుంది. ఆ రోడ్ లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉండాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్య అనేక సార్లు స్థానికులు అధికార పార్టీ నాయకులు మరియు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు, విద్యార్థులు జనసేనపార్టీ అధ్యక్షులు గాదె కి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గాదె వెంటనే స్పందించి ఒక ట్రాక్టర్ డెస్ట్, ఇసుక తెప్పించి ఆ రోడ్డుకి మరమ్మత్తులు స్థానిక విద్యార్థులు, గ్రామస్తుల మరియు జనసైనికులు చేతులమీదుగా చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరితగతిన స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ఎంత కాటికి అధికార పార్టీ వారు దోచుకోవటానికి దాచుకోటానికి తప్ప దేనికి వారి అధికారాన్ని ఉపయోగించలేదు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్స్ హోమ్ మినిస్టర్ కావటం, వైసిపి గుంటూరు జిల్లా ఇన్చార్జి అయి ఉండి కూడా ఏమి చేయలేని బొమ్మలా ఉండిపోవటం సిగ్గుచేటు. ఈ నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అని ఎద్దేవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, వట్టిచెరుకూరు మండల అధ్యక్షులు పత్తి భావన్నారాయణ, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.