రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు చేపట్టాలి: రామశ్రీనివాసులు

*సుండుపల్లి నుంచి రాయచోటి వెళ్ళే రహదారి పై ప్రమాదానికి గురైన 2 ద్విచక్ర వాహనాలు

తిమ్మసముద్రం గ్రామంలో జగిలి రాజు ఆయన సతీమణి అన్నుంపల్లి అడవికి ముందే తగ్గులో ఇరుకుగా ఉన్న దారిలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీ కొట్టుకొని.. క్రింద పడి వాహనాలు డ్యామేజ్ అవ్వడంతో పాటుగా మహిళకు మో కాలు వద్ద ప్యాచర్ అవ్వడం జరిగింది. అక్కడ జరిగిన ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు రామశ్రీనివాసులు అక్కడ ప్రమాదానికి గురైన వారిని పరామర్శించి.. మనోధైర్యం చెప్పడం జరిగింది. అలానే వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా రహదారికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. అలానే పాలకులు నిర్లక్ష్యం వీడి రహదారి మరమ్మతులు త్వరతీగతిన పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున రామశ్రీనివాసులు డిమాండ్ చేయడం జరిగింది.