కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్‌

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందనున్నట్లు చెప్పారు. కాసేపటి, క్రితం ఓ ట్వీట్‌ చేసిన సచిన్‌.. తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పారు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు 2011లో టీమ్‌ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి నేటికి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో సచిన్‌.. దేశ ప్రజలకు, తన సహచరులకు శుభాకాంక్షలు చెప్పారు.