జనవాణి కార్యక్రమంలో సర్వేపల్లి సమస్యలు

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, అక్రమ గ్రావెల్ తవ్వకాలు అదేవిధంగా పంటపాలెం నందు భూగర్భ జలాల తరలింపు అదేవిధంగా 117 పంచాయతీల్లో స్మశాన వాటిక లేక ప్రజలు పడే ఇబ్బందులు వీటన్నిటిని వినతిపత్రం రూపంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అందచేయడం జరిగింది. ఇటీవల నాపై పెట్టిన అక్రమ కేసు గురించి కూడా అది నేతకు తెలియజేయడం. ఈ కేస్ విషయంలో నాకు వెన్నంటే ఉన్న నెల్లూరు జిల్లా అధ్యక్షులు చదలవాడ రాజేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సమక్షంలో నియోజకవర్గ సమస్యలన్నీ వినతిపత్రం రూపంలో అందజేయడం జరిగింది.