తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

మధిర: సావిత్రిబాయి పూలే 192 వ జయంతి సందర్భంగా మంగళవారం వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భం గా జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో విజ్ఞానం నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి భారతీయ సంఘ సంస్కర్త భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొనకల్ మండల నాయకులు ఎస్ కే జానీ, భాష, మండల నాయకులు లక్కి శెట్టి సాయి, రామయ్య, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.