హరరామ జోగయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన బొమ్మిడి నాయకర్

రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరరామ జోగయ్య కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలి అని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపిచ్చిన తరుణంలో పోలీసులు వారిని దౌర్జన్యంగా అరెస్టు చేసి అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారు దీక్షను విరమించుకుని ఇంటికి తిరిగి వచ్చిన నేపథ్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నరసాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.