SBI కస్టమర్స్ మనీ కోసం ఇక నుండి ఏటీఎంకి వెళ్లక్కర్లేదు

ఒకప్పుడు బ్యాంకుకి వెళ్తే కానీ డబ్బులు విత్ డ్రా చేసుకునే వీలు ఉండేది కాదు. ఏటీఎంలు వచ్చాకా డబ్బుల కోసం బ్యాంకుల వరకు వెళ్లే బాధ తప్పింది. మీకు దగ్గర్లో ఉన్న ఏ ఏటీఎంకు వెళ్లినా మీ బ్యాంక్ ఎకౌంట్ నుండి డబ్బు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తాజాగా SBI అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త సేవలతో ఇక మీరు ఏటిఎం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండానే డబ్బు డ్రా చేసుకోవచ్చు.  

SBI కస్టమర్లు ఇకపై ఏటీఎం సేవల కోసం అవసరం అయితే, ఏటీఎం సెంటర్స్ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఎస్బీఐకి కాల్ చేసినా… లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా.. SBI Mobile ATM మీ ఇంటి ముందుకే వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలను లక్నో వరకు మాత్రమే పరిమితం చేశామని.. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగతా నగరాలకు కూడా ఈ డోర్ డెలివరీ సేవలు విస్తరింపజేస్తామని లక్నో సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.