ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించిన ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. డిపాజిట్లపై ఇక తక్కువ రాబడి వస్తుంది. ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాల పరిమితుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. సెప్టెంబర్ 10 నుంచే తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. బ్యాంక్ ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. రేట్ల కోత నిర్ణయం కొత్తగా డబ్బులు ఎఫ్‌డీ చేరికి లేదంటే రెన్యూవల్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ చివరిగా మే 27న ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు రేట్ల కోత తగ్గింపు నిర్ణయం తర్వాత 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల కాల పరిమితిలోని టర్మ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ పొందొచ్చు. 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తుంది. ఇది వరకు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.1 శాతంగా ఉండేది. అదేసమయంలో రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీ పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. ఇక చివరిగా ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ మాత్రం సాధారణ కస్టమర్లతో పోలిస్తే అధిక వడ్డీ రేటు శాతం వర్తిస్తుంది.

సీనియర్ సిటిజన్ లకు 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్స్‌కు 3.4 శాతం నుంచి 6.2 శాతం మధ్యలో వడ్డీ లబిస్తుంది.