సర్వేపల్లిలో జనంకోసం జనసేన రెండవరోజు

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, చిన్న చెరుకూరు పంచాయతీలో రెండవ రోజైన బుధవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ చిన్న చెరుకూరు పంచాయతీ అరుంధతి వాడలో ప్రజలు వీధి లైట్లు లేక, సైడ్ కాలువలు పరిశుభ్రపరచకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. అదేవిధంగా పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరం. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త కూస్తో డబ్బులతో ఇళ్లు అయితే కొంతవరకు నిర్మాణం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే డబ్బు కావాలి ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న ఇళ్ల పట్టాలు ఎందుకని ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతుంది. ఎందుకని మంత్రి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం లేదు. త్వరితగతిన వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే జనసేన పార్టీ వాళ్లకి అండగా నిలబడి, వాళ్లకి ఇళ్ల పట్టాలు ఇచెంతవరకు పోరాడుతాం. అదేవిధంగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. మురుగు కాలువల్లో బ్లీచింగ్ కొట్టించాలని డిమాండ్ చేస్తున్నాం, లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో మేమే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సాయి, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం భాయ్, అగ్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.