బోల్లవరం గ్రామంలో ఈ.వి.యం మిషన్ ప్రదర్శన కేంద్రం ఏర్పాటు

నందికొట్కూరు: బొల్లవరం గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ.వి.యం ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు అవగాహన చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు నల్లమల రవికుమార్, పంచాయతీ సెక్రెటరీ నూరుల్ల, వి. ఆర్. ఓ మద్దిలేటి, మహీల పోలీస్ లక్ష్మి, వి.ఆర్.ఎ. వాసుదేవ్ తదితర గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు మిషన్ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఓటు వేయాలి, మనం ఓటు వేసిన తర్వాత ఎక్కడ మనం చూసుకోవాలి అనే విషయాలపై పంచాయతీ ఆఫీసు సిబ్బంది వివరించడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలతో శాంపిల్ గా ఓట్లు వేయించి మిషన్ ను గమనించడం జరిగింది.