Srikalahasti: ఏడవరోజు అరుంధతివాడ గ్రామంలో “KNOW MY CONSTITUENCY”

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కార దిశగా, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ప్రారంభించిన “ఖ్ణోవ్ ంY ఛోణ్శ్టీటూఏణ్ఛ్Y” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పేడు మండలం , చెల్లూరు అరుంధతివాడ గ్రామంలో పర్యటించడం జరిగింది. మొదటగా గ్రామంలో అమ్మ వారి దేవాలయంలో జాతర పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

ఈ క్రింది సమస్యలను ప్రజలు శ్రీ వినుత దృష్టికి తీసుకునిరావడం జరిగింది.

  1. గ్రామం కి రాకపోకలకు బస్ సౌకర్యం లేదు:- గ్రామం లో స్కూల్ కి వెళ్ళే పిల్లలు 3-4 కి. మీ నడిచి వెళ్లాలి, అత్యవసరం ఆరోగ్య సమస్య అయిన ప్రయాణించడానికి ఎలాంటి సౌకర్యం లేదు. బస్ సౌకర్యం లేక గ్రామం లో ప్రజలు 3-4 కి.మీ నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
  2. గ్రామంలో బాల్వాడి స్కూల్ లేదు, ప్రాథమిక స్కూల్ కూడా లేదు. గ్రామంలో పిల్లలు స్కూలుకి వెళ్ళాలి అంటే అన్న 3-4 కి.మీ పక్కన ఉన్న గ్రామానికి వెళ్లి చదువుకోవాలి. బస్ ప్రయాణ సదుపాయాలు లేక పిల్లలు 3-4 కి.మీ నడవలేక బడి మానేస్తున్నారు.
  3. గ్రామంలో స్ట్రీట్ లైట్స్ లేవు.
  4. స్మశానానికి దారి లేదు.
  5. త్రాగునీటి కొరకు టాంక్ సౌకర్యం లేదు.
  6. రైతులకు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర దొరకట్లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమాలు అస్సలు చెయ్యటం లేదు.
  7. చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు.

గ్రామస్థుల సమస్యలను విన్న వినుత గారు మండల అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే వరకు ప్రజల వెంట నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.