లంకజనపల్లి జనసైనికులతో సమావేశమైన షేక్ ఇర్షద్

దర్శి నియోజకవర్గం: పొదిలి రోడ్ లోని వరికూటి నాగరాజు క్యాంప్ కార్యాలయం నందు దర్శి మండలం, లంకజనపల్లి గ్రామ జనసైనికులతో సమావేశమైన దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షద్. ఈ సమావేశంలో త్వరలోనే వరికూటి నాగరాజు యూత్ ఆధ్వర్యంలో లంకొజనపల్లి గ్రామంలో చేపట్టబోయే ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా మనం అందరం కలిసికట్టుగా పని చేయాలని దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షద్ సూచించారు. అనంతరం వరికూటి నాగరాజు బైక్ స్టిక్కర్స్ అందించడం జరిగింది.