అమరావతి రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నాయకులతో కలిపి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేపు 18వ తేదీ మంగళవారం రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్రను అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయవంతం చేయాలని అమరావతి రైతుల పాదయాత్రకు అమలాపురం నియోజకవర్గం నుండి జనసైనికులు, వీర మహిళలు, రైతులు నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని కొంతమంది వైసిపి నాయకులు అడ్డుకుంటామని మరికొంతమంది మేం కూడా అక్కడికి వస్తామని చెబుతున్నారు. వారందరి కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తన సమస్యను చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజా సమస్యలను గాలికొదిలేసేతత్వం కాదు పవన్ కళ్యాణ్ ది. అంతేకాకుండా రైతుల పాదయాత్రను నిరంకుశంగా ఆపడానికి వైసిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ మరమ్మతుల పేరుతో వారం రోజుల పాటు మూసివేయడాం చాలా సిగ్గుచేటని ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతుల పాదయాత్ర ఆగదని దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఉన్నంత వరకు రైతులు పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి మహదశ నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, సీనియర్ నాయకులు సుధా చిన్నా, ఆకుల బుజ్జి, గండి స్వామి, చిక్కం సూర్యమోహన్, ముత్తాబత్తుల శ్రీను, లంకే వెంకటరావు, పోనకల ప్రకాష్, గొర్తి పవన్, పినిశెట్టి సురేష్, అత్తిలి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.