ఏపీ సర్కారుకి షాక్.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు
ఏపీ సర్కారుకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.