శ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం: గొల్లప్రోలుమండలం, దుర్గాడగ్రామంలో గల ఈబిసీ కాలనీ నందు శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ గణపతి ఆలయకమిటీ వారి ఆహ్వానం మేరకు జనసేన జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హాజరై విగ్రహప్రతిష్ట కార్యక్రమాలైన మహాగణపతి పూజ, మహా పూర్ణాహుతి, కుంభకళా ఆవాహన, కుంభదర్శనం తదితర పూజాకార్యక్రమాలలో పాల్గొని శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అనంతరం శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి ని దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్దలు, జ్యోతుల శ్రీనివాసు ని ఘనంగా సత్కరించి,జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేననాయకులు కందా శ్రీనివాసు, కాపారపు వెంకటరమణ, మంతిన గణేష్, జ్యోతులసీతారాంబాబు, ఆలయకమిటీసభ్యులు అబ్బిరెడ్డి మల్లేశ్వరరావు, రాసంశెట్టి శ్రీను, సఖినాల వీరబాబు, గొల్లపల్లి నాగేశ్వరరావు, పిల్లి యాతిమాని, కొయ్యా చిన్న, ఉంగరాల నాగేశ్వరరావు, పడాల సురేష్, ఆకుల నాగేశ్వరరావు, బొమ్మిడి కాశి, పురోహితులు చెరుకూరి వీరబాబు, చెరుకూరు దత్తు తదితరులు ఉన్నారు.