చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన జనసేన నాయకులు

సింగరాయకొండ ట్రంక్ రోడ్డు లోనీ జనసేన పార్టీ అధ్వరంలో.. ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి 11 వారాలు పూర్తి చేసుకొని, వేసవికాలంలో దాహార్తి తీర్చడానికి ప్రతీ రోజు చల్లని మినరల్ వాటర్, మరియు వారంలో ఒక్క రోజు ఆదివారం చల్లని మజ్జిగ ప్రయాణికులకు, బాటసారులకు, యచకులకు మరియు ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, సంకే నాగరాజు, పోలిశెట్టి విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, షేక్ సుల్తాన్ బాషా, షేక్ సుభాని మరియు జనసైనికులు పాల్గొన్నారు.