డీకే పట్నం పంచాయతీలో తాగునీటి సమస్యను పరిష్కరించండి: జనసేన

డీకే పట్నం గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య వెంటనే సమస్యలను పరిష్కరించాలని జనసేన ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మనీ, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ డీకే పట్నం గ్రామ ప్రజలకు తాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, చిట్లి గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, బోనిల గోవిందమ్మ, కర్రీ మణికంఠ, అన్నేబత్తుల దుర్గాప్రసాద్, ఖాతా విశ్వేశ్వరరావు, పాత్ర పవన్, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, పైల రాజు, దుర్గా, కేశవరావు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.