ప్రైమ్ 9 న్యూస్ ప్రసారాలను పునరుద్ధరించాలని సోమరౌతు అనురాధ డిమాండ్

ఉమ్మడి గుంటూరు జిల్లా, వేమూరు నియోజవర్గం, రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న ఛానల్ గా పేరు పొందిన ప్రైమ్ 9 న్యూస్ తెలుగు ఛానల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వంను జిల్లా కార్యదర్శి శోమరౌతు అనురాధ డిమాండ్ చేశారు. నిజాలను నిర్భయంగా, ప్రభుత్వాల ఒత్తిడికి లొంగకుండా, ప్రజల కోసం పోరాడుతున్న ఛానల్ ప్రసారాలను ఆపివేయడంలో జగన్, కెసిఆర్, మేఘా కృష్ణారెడ్డిల కుట్ర ఉన్నదని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఖండించాలని సోమరౌతు అనురాధ విజ్ఞప్తి చేశారు.