29వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సోమరౌతు అనురాధ

వేమూరు, బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులూర్పించడం జరిగింది. వేమూరు నియోజవర్గలోని వేమూరు సెంటర్లో ఎమ్మార్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుక జరుపుకున్న మాదిగ సోదరులకు జనసేన శుభాకాంక్షలు తెలియజేసారు. అదే విధంగా 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న మంద కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ నియోజవర్గ నాయకులు బ్రహ్మం పాల్గొనడం జరిగింది. తదనంతరం వేమూరులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనురాధ సుమారు 100 కు పైగా జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు వేమూరి సుధీర్ మాదిగ, వేమూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మురాల వాసుదేవ్ గౌడ్, మహిళా నాయకురాలు కరుణా సుజాత, సభ అధ్యక్షులు ఎలమాటి దాసుబాబు ఎమ్మార్పీఎస్ వేమూరు నియోజకవర్గం కార్యదర్శి పాప నాని, ఎమ్మార్పీఎస్ చుండూరు మండల అధ్యక్షులు మున్నంగి ఐజక్, కొల్లూరుమండల అధ్యక్షుడు సాగర్, వేమూరు మండల అధ్యక్షులు దేవరాజ్, బట్టిప్రోలు మండల అధ్యక్షులు అతోట ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.