భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని పట్టణంలోని శ్రీఉమాభీమేశ్వరజనార్దనస్వామి వారి ఆలయంలో కెజిఆర్ యూత్ మరియు జనసేన అధ్వర్యంలో గోవిందరావు పేరు మీద అభిషేకాలు చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు లంకపల్లి నాగు, సుంకర సతీష్, ముత్యాల వాసు, నడపన నారాయణ, అల్లం రాజ, దిరిశాల మనికృష్ణ, గణేష్, పెద్ది రాజు, ముత్యాల సతీష్, బండి ఫణి, కోలా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.