మైలవరం జనసేన కార్యాలయంలో టిడిపి పార్టీల ఆత్మీయ సమావేశం

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ది:04-04-2024 అనగా గురువారం సాయంత్రం 5.00ప్మ్ గంటలకు కొండపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని! ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామఅధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాద్(చిన్ని), మరియు మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరవుతారని తెలియజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ)అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పురమ సతీష్, జనసేన పార్టీ మండల నాయకులు ఆకుతోట ఈశ్వర్, చంద్రాల మురళీకృష్ణ, మాదినేని చిన్న రామారావు, ఉయ్యూరు నాగరాజు, చండ్రగూడెం గ్రామ ప్రధాన కార్యదర్శి మర్రి కొండలరావు, సంయుక్త కార్యదర్శి పెద్దారపు సాయి, వెల్వడం గ్రామ జనసైనికులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.