పాలకొండలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో బుధవారం పాలకొండ మండలం పోట్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోట్లి గ్రామ ప్రజలతో సత్తిబాబు గారు మాట్లాడుతూ జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఎంతో పెద్ద మనసుతో జనసైనికుల కుటుంబాలకు భద్రతగా జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ఆ గ్రామ రైతులతో మాట్లాడుతూ…. పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు ఆర్ధిక సహాయం అందచేశారని తెలియచేసారు. అలాగే జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు రూ.5 వేల పెన్షన్, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మరియు రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని అలాగే మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ. పదివేలకు పెంపు, అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద.. 60 ఏళ్ల పైబడిన రైతులు, కౌలు రౌతులకు నెలకు రూ.5 వేల పెన్షన్. ప్రాజెక్టుల కోసం భూమిని కోల్పోయి వారికి 2013 భూసేకరణ చట్టం కింద న్యాయం. అలాగే ఆహార ధాన్యాలు, పండ్ల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవడానికి, ప్రతి జిల్లాలోని అన్ని మండలాల్లో శీతల గిడ్డంగుల ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మరియు రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు ఇస్తాం అలాగే ప్రతి జిల్లాలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానిస్తానం. రిజర్వాయర్లను నిర్మిస్తాం అని ఆయన అన్నారు. మహిళలతో మాట్లాడుతూ సంవత్సరానికి ఆరు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తారని, అలాగే రేషన్ కి బదులుగా మహిళల కాతాల్లో మీకు కావలసిన సరుకులు మీరే నచ్చినవి కొనుక్కునేట్టు నేరుగా డబ్బులు జమ చెయ్యబడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ప్రజలకు మధ్య వారధిగా క్రియాశీలక సభ్యులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన నాయకులు వజ్రగడ రవి కుమార్, వండాన సాయి కిరణ్, సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, పాలకొండ మండల నాయకులు రాజశేఖర్, ఎమ్.కిరణ్, డంపాక సాయి కుమార్, పొట్లి గ్రామ జనసేన నాయకులు సంబాన రాధాకృష్ణ మరియు గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.