కరణి గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

మంత్రాలయం నియోజకవర్గం: కౌతాళం మండలం, కరణి గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గ తాలూకా జనసేన నాయకులు పొంత నరసింహులు ఆధ్వర్యంలో “ఊరు వాడ జనసేన పార్టీ” కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని, ప్రతి ఒక్కరూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. పార్టీ పొత్తుల విషయం అధినాయకుడి నిర్ణయం అని వివరించారు. ఈ సమావేశంలో రవికుమార్, లక్ష్మణ్, నాగేష్, మహేష్, గణేష్, రఘు, హసేని, ఫోటో వెంకటేష్, దొడ్డి లక్ష్మన్న, నాగరాజు, తిరుమలేష్, మల్లేష్ నరసింహులు, నాగిరెడ్డి, అంజి జనసైనికులు పాల్గొన్నారు. కోసిగి మండల నాయకులు చింతలగేని వీరారెడ్డి, చింతలగేని నాగేష్ పాల్గొనడం జరిగింది.