SRH Vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్‌ 2020 లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు హైదరాబాద్- పంజాబ్ జట్ల మధ్య కీలకపోరు జరుగుతుంది. కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకమైనదిగా చెప్పాలి. ఇప్పటి వరకు పంజాబ్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. ఇకపై ప్రతి మ్యాచ్ కూడా ఆ జట్టుకు కీలకం కానున్నది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్ లలో రెండు మాత్రమే విజయం సాధించి మూడు ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుకు కూడా ప్రతి మ్యాచ్ కీలకం అని చెప్పాలి. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ రేసులో ఉండాలని హైదరాబాద్ చూస్తున్నది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.