శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మనుషులు భూ కబ్జా, దౌర్జన్యం!!

  • 16 కోట్లు విలువ చేసే భూమిని 1.5 కోటికి ఇవ్వాలని మహిళలని బెదిరింపులు
  • భూ కబ్జా, వేధింపుల నుండి కాపాడాలని సహాయం కొరకు జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ను ఆశ్రయించిన బాధితులు
  • పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇవ్వడం జరిగింది

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని ఊరందురు ఆర్చి దగ్గర వున్న ఇల్లు మరియు కాళా స్థలం కోసం ఎమ్మెల్యే మనుషులు అని వచ్చి బెదిరిస్తున్నారని, మా ఇల్లు మరియు స్థలానికి జేసీబీ చదును చేస్తాము అని కొంతమంది మనుషులు వచ్చి బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే బియ్యపు మధు సుధన్ రెడ్డి మనుషులు అని చెప్పి అరఖాడ్ ముత్తు, కంచి. గురవయ్య, సుబ్రహ్మణ్యం వాళ్లు వచ్చి బెదిరించి అగగ్రిమెంట్ రాయించుకున్నారని. గవర్నమెంట్ రేట్ 5000 రూపాయలు స్క్వేర్. ఫీట్ ని 1000 రూపాయలకు రాయించుకున్నారు. అగ్రిమెంట్ గదువు ముగిసినా కూడా వాళ్ల మనుషులని పంపించి మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారు. బలవంతంగా జెసిబిలు తెచ్చి ఎమ్మెల్యే పేరుతో మహిళలని వేధిస్తున్నారని బాధితులు తెలిపారు. అగ్రిమెంట్ రాసుకున్న వారి సిద్ధప్ప రెడ్డి మునిశేఖర్ రెడ్డి ఎవరో కూడా మాకు తెలియదు, అతని పేరు చెప్పి ఇక్కడ వున్న వైస్సార్సీపీ నాయకులు బెదిరిస్తున్నారు. సర్వే నెంబర్ -193/1, 204/5
డేగ. గుణభూషణమ్మ మరియు వారి కూతుర్లకు సంబంధించిన ఆస్తి పానగల్, శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్థిని కబ్జా చేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు. మధుసూదన్ రెడ్డి గారి మనుషులు అర్హడ్. ముత్తు, కంచి గురవయ్య, సుబ్రమణయం మరియు వాళ్ల మనుషులు వచ్చి ల్యాండ్ కబ్జా చేస్తాముని భేదిరిస్తున్నారని వినుత కు తెలిపారు. మంగళవారం వారి ఇంటికి స్వయంగా వినుత వెళ్లి బాధితులకు అండగా జనసేన ఉంటుందని బరోసా ఇచ్చారు.