ఎన్టీఆర్ ఓకే చేసిన కథ
కె.జి.యఫ్ చాప్టర్1 బ్లాక్బస్టర్ హిట్తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ సెట్స్లో ఉండగానే టాలీవుడ్ అగ్ర కథానాయకులను కలిసి ఓ కథ చెప్పారు. ఈ కథను ముందు మహేశ్ విని ఆయన నో చెప్పగా… అదే కథను ఎన్టీఆర్ ఓకే చేశారట. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రూపొందబోయే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమా ఎన్టీఆర్కు ఎలాంటి అనుభవాన్నిస్తుందో మనం వేచి చూడాల్సిందే.