జనసేనను ఆదరించండి

  • ఇంటింటా ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట, కులమతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని ఆపార్టీ యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు బుధవారం హెచ్ కొత్తపల్లె పంచాయతీలోని మేడావారి పల్లిలో రాజంపేట జనసేన నాయకులు ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలన దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి శ్రీనివాసులు, పోలిశెట్టి రజిత, రెడ్డి రాణి, బాలసాయి, శంకరయ్య, భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి, పోలిశెట్టి చంగల్ రాయుడు, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.