స్వామీ మీ అధికారం కుష్ఠు వ్యాధి గ్రస్తుల మీదనా???: డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం గ్రామపంచాయతీ, కొమరగుంట గ్రామ లెక్క దాఖలా లో నివాసముంటున్న మంగమ్మ శివయ్యలకు చెందిన ఒకటిన్నర సెంటు స్థలాన్ని స్థానిక వైసిపి నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విధానాన్ని తప్పు పడుతున్నానని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డా. యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వత్తాసు పలుకుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిని కుష్టు వ్యాధిగ్రస్తులను కూడా వదలరా? మీకున్న విశేషాధికారాలను వ్యాధిగ్రస్తుల మీద ప్రయోగిస్తారా? ఇదేనా మీరు అంబేద్కర్ కి ఇచ్చే ఘనమైన నివాళి? ఇదేనా మీరు చూపించే నిరుపేదల మీద ప్రేమ? ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రోగులను కూడా వదలని నా కలలో కూడా ఊహించలేదు. ఒకటిన్నర సెంటు భూమి కూడా వదలరా మీ నాయకుల కోసం?? ఇందుకేనా మీరు ముఖ్యమంత్రి కాళ్ళమీద పడేది, ఛీ ఛీ అని ఛీత్కరించుకుంటున్నారు ప్రజలు అని ఎద్దేవా చేశారు. మంగమ్మ శివయ్య లకు న్యాయం చేయకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం అని హెచ్చరించారు. అధికారులు మీ విధులకు భంగం కలుగకుండా, మీ బాధ్యతలను మర్చిపోకుండా నిర్వర్తించి వారికి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. వారిని బెదిరించే చోటా నాయకులకు ఒకటే మాట, నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇబ్బంది పెట్టకండి లేదంటే న్యాయ పోరాటం చేస్తా, జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి అండగా నిలబడతా, ఆమరణ దీక్ష చేస్తా, వారిని ఇబ్బందులకు గురి చేస్తే మీ ఇంటిని కూడా ముట్టడిస్తా, తగిన బుద్ధి చెబుతా, ఖబడ్దార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, బాధితులు ఉన్నారు.