జనసైనికుడు సాయిబాబాని పరామర్శించిన తంబళ్లపల్లి రమాదేవి

  • కంచికచర్ల జనసైనికుడు కంచెటి సాయిబాబాని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి

నందిగామ: గత రెండు రోజులు క్రితం కంచికచర్లకు చెందిన కంచెటి సాయిబాబా కి బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో విజయవాడ వజ్రాల శివకుమార్ (వి.ఆర్.ఎల్.ఎస్) హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వెంటనే స్పందించి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి సాయిబాబాని పరామర్శించి ఆర్థిక సహాయం చేసి సాయిబాబా ఆరోగ్య రీత్యా డాక్టర్ గారితో మాట్లాడి బాగోగులు చూసుకుంటానని వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ తోట ఓంకార్ సాయిబాబాను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.