జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంకు సంబంధించిన “జనసేన-తెలుగుదేశం” పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో మంగళవారం జనసేన పార్టీ తరపున బాల్యం రాజేష్, తెలుగుదేశం పార్టీ తరఫున ఉమామహేశ్వరనాయుడు పాల్గొని, ఈ సమావేశంలో రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, లోకల్ మేనిఫెస్టో, రెండు పార్టీల పొత్తు ప్రణాళిక మొదలైన అనేక అంశాలు గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రెండు పార్టీలకు సంబంధించి 5 మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.