ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్..

నందమూరి తారకరామారావు 99 వ జయంతి సందర్భాంగా ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. జయంతి సందర్బంగా జూ. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది..  మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను.. నందమూరి తారకరామారావు” అంటూ తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. కళ్యాణ్ రామ్, నారా రోహిత్ తదితరులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేసారు.