బత్తులతోనే మా ప్రయాణం అంటున్న బూరుగుపూడి ఎమ్మార్పీఎస్ యువత

రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామం నుంచి బత్తుల బలరామకృష్ణ దంపతుల సేవా కార్యక్రమాలు నచ్చి, వారి ఇంటికి వెళ్లి దంపతుల్ని సాలువాతో సన్మానించి వారితోనే మా ప్రయాణం అని బూరుగుపూడి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. అనంతరం బత్తుల దంపతుల ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకుని జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఇక నుండి మా ప్రయాణం బత్తుల బలరామకృష్ణతోనే చేస్తామని వారికి తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా త్వరలో బూరుగుపూడి గ్రామానికి విచ్చేయాలని యువకులు బలరామకృష్ణ దంపతుల్ని కోరడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ దంపతులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు వారందరూ చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.