శ్రీమతి లోకం మాధవికి ఉపాధ్యాయుల వినతిపత్రం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులందరూ శ్రీమతి లోకం మాధవిని కలిసి, గత ఐదు ఏళ్లగా వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు పడుతున్న వేదనలు, సరైన సమయానికి జీతాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఉండటం వంటి విషయాలు శ్రీమతి లోకం మాధవికి తెలియజేసుకున్నారు. అలాగే సిపిఎస్ విధానం నుండి ఓపిఎస్ విధానానికి మార్చేలా ఇరు పార్టీ అధినేతలకు వినతి పత్రాన్ని అందజేయాలని శ్రీమతి లోకం మాధవిని ఉపాధ్యాయులు కోరారు. వినతి పత్రం అందుకున్న మాధవి వారికి న్యాయం జరిగేలా వారి సమస్యను ఇరు పార్టీ అధినేతల దగ్గరికి తీసుకొని వెళ్తానని తెలిపారు.