336 పరుగులకు టీమిండియా ఆలౌట్..
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 33 పరుగుల ఆధిక్యాన్ని కనబర్చింది. టీమిండియా ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్ (62), శార్దూల్ ఠాకూర్ (67) అర్ధశతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ (44), శుభమన్ గిల్ (7), పుజారా (25), అజింక్యా రహానే (37), మయాంక్ అగర్వాల్ (38), రిషభ్ పంత్ (23), సైనీ (5), సిరాజ్ (13), నటరాజన్ (1 నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజిల్వుడ్ 5 వికెట్లు తీయగా.. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు, లైయన్ ఓ వికెట్ దక్కాయి.