ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా కసరత్తు….
ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీసుకు టీమిండియా వేగంగా సన్నద్ధమవుతోంది. క్రికెటర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పొట్టి క్రికెట్ సిరీస్లో అదరగొట్టాలని తపిస్తున్నారు. ఎల్లుండి తొలి మ్యాచ్ ఉండటంతో మైదానంలో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ నెల 12న మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెప్పింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో చేరడంతో శిబిరం సందడిగా మారింది. వారితో పాటు భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్ మంచి జోష్లో కనిపించారు. రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశారు. భారీ షాట్లు ఆడారు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్లు ప్రాక్టీస్ చేశాడు.