టీమ్ పిడికిలి వారి జనసేన రైతు భరోసా యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ

30 కోట్లతో 3000 మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి టీమ్_పిడికిలి పోస్టర్లను మదనపల్లి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీ నివాస్, సుబ్రహ్మణ్యం, క్రిష్ణ మూర్తి, వినయ్, అశోక్, భాను ప్రసాద్, రమేష్, శీనయ్య, స్రవంతి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ.. టీమ్ పిడికిలి వారి కృషి పట్టుదల జనసేనను గెలుపు దిశగా పయనించేందుకు దోహదపడుతుందని, ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న రాజా మైలవరపు టీమ్ పిడికిలి వారి బృందానికి అభినందనలు తెలిపారు.