ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబిలీహిల్స్ ప్రశాసన్ నగర్లోగల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. తదనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఎందరో త్యాగాల ఫలితమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.