శ్రీనగర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు కాల్పులు..ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్ సరిహద్దుల్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. పారింపొరా పోలీస్ స్టేషన్ ఏరియాలోని లాపోరాలో సిఆర్పిఎఫ్ సిబ్బంది ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దీంతో నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లు గాయపడ్డారని…సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు వెల్లడించారు. మృతులను సబ్ ఇన్స్పెక్టర్ మంగా రామ్ దేవ్ బర్మన్, కానిస్టేబుల్ అశోక్ కుమార్గా గుర్తించామన్నారు.