వినాయక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తంగెళ్ళ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గంలో ఆదివారం చిత్రాడ మరియు గొల్లప్రోలు మరియు చేబ్రోలు గ్రామాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమములో పాల్గొని ఉత్సాహంగా గ్రామస్థులకు వడ్డిస్తూ వారితో కాసేపు ముచ్చ?తించారు. అనంతరం గ్రామంలో వివిధ వర్గాల ప్రతినిధులుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.