విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దారి పొడవునా హారతులిచ్చి ఆశీర్వదించిన ఆడపడుచులను, సాదర స్వాగతం పలికిన జనసేన శ్రేణులను ఎప్పటికీ మర్చిపోను. సభకు అశేషంగా హాజరైన జన సైనికులు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. వారాహి యాత్ర, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్లకు అభినందనలు. వారాహి యాత్ర, సభ నిర్వహణలో పాలుపంచుకున్న పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి, పార్టీ పిఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, లీగల్ సెల్, ఐటీ సెల్, డాక్టర్స్ సెల్ సభ్యులకు, చేనేత, మత్స్యకార వికాస విభాగాల సభ్యులకు, కృష్ణా జిల్లా కమిటీ, విజయవాడ నగర కమిటీలకు అభినందనలు. ఆవిర్భావ దినోత్సవ సభాస్థలికి, పార్కింగ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సభకు సహకరించిన పోలీసు శాఖకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.