పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలి

  • సీనియర్ జనసేన నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి

పూతలపట్టు నియోజకవర్గం: తవణం పల్లి మండలం, కన్నవాండ్లవూరు గ్రామంలోని దళిత వాడలో శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించి అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా చూసి గ్రామస్థులతొ మాట్లాడి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో దళితులకు శ్శశాన వాటికకు దారి లేక ఇబ్బందికరంగా ఉండటం, మరుగుదొడ్లు లేక గ్రామం లోని స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పడుతున్న కష్టాలను తెలుసుకుని ఈ సమస్యలను పరిష్కార దిశగా త్వరలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్దామని రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన రాజకీయ పార్టీ ఒక జనసేన పార్టీ అని తెలిపారు. నా అక్కమ్మలకు చెల్లమ్మలకు అని పిలిచే మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్త్రీల పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. స్త్రీలలో ఉండే వీరత్వం, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగ పడాలని వీరమహిళ విభాగం పెట్టి గౌరవనీయమైన స్థానాన్ని కల్పించిన నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేశారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పార్టీనీ గెలిపించాలని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలని కోరుతున్నాము అన్నారు. జనసైనికులు అందరూ ప్రజలందరితొ ఐక్యమత్యంగా కలసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిధ్ధాంతాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్క జనసేన నాయకులను, జనసైనికులను కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మరియు జనసైనికులు పాల్గొన్నారు.