నాలుగు సవరణలకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ ఈరోజు జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్బంగా చట్ట సవరణ బిల్లును మంత్రి కెటిఆర్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
సభ ఆమోదం తెలిపిన ఆ నాలుగు బిల్స్ ఇలా ఉన్నాయి. 1. ఇండియన్ స్టాంప్ బిల్, 2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ బిల్ , 3. జిహెచ్ఎంసి సవరణ బిల్లు , 4, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
ఇక జీహెచ్ఎంసీ చట్టంలో బీసీల రిజర్వేషన్ యథాతథంగా ఉందని, ఇందులో ఎలాంటి మార్పూ చేయలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆర్టికల్ 243 -టీ ప్రకారం 33.333 శాతం బీసీ రిజర్వేషన్లను డిస్టబ్ చేయలేదని చెప్పారు.