ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి అమానుషం: పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి అమానుషం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలకు సరైన రక్షణ కల్పించలేని మీరు ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు