మన్యంలో రోడ్ల దుస్థితి పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి..?: అరకు జనసేన

*జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా కొర్రా ప్రవీణ్ కుమార్ మండల అధ్యక్షులు చిట్టం మురళి

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం. అనంతగిరి మండలం, టోకూరు పంచాయతీ పరిధిలో గల నిమ్మగూడా, ముహంవలస రోడ్ల దుస్థితి పై జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, కొర్రా ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు చిట్టం మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకు నియోజకవర్గం అనంతగిరి మండలాల్లో గల పలు పంచాయతీ పరిధిలో గల గ్రామాలలో రోడ్ల దుస్థితి ఫై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి నాయకత్వంలో మరి చారని, ఇప్పటికైన నిద్రపోతున్న ముఖ్యమంత్రి గారిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిద్ర నుంచి మేలుకొలుపు తున్నాము. కావున మండలంలో ఉన్న రోడ్ల గుంతలను పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.