పలుకుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన, శ్రీకాకులపు వినయ గుప్త చిత్రపటానికి నివాళులర్పించి వినయ గుప్తకి జనసేన పార్టీ లో పార్టీ సభ్యత్వం ఉన్నందున వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు వచ్చేలా కృషి చేస్తానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మరియు ఐ పోలవరం గ్రామంలో అకాల మరణం చెందిన ప్రముఖ సన్నాయి కళాకారులు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకున్న షేక్ బాబ్జీ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, షేక్ మౌలాలి, దేవి రాంబాబు, రామకృష్ణ, దూడల స్వామి, సలాది రాజా, మల్లిపూడి రాజా, గాంజా ఏసు, వంగ విజయ సీతారాం తదితరులు పాల్గొన్నారు.