రోడ్ల పరిస్థితిపై సర్కారు మొద్దునిద్ర వీడాలి: రాటాల రామయ్య

*గుంతల వద్ద నిరసన తెలిపిన జనసేన నాయకులు

సిద్ధవటం: గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ జనసైనికులు డిజిటల్ క్యాంపెయిన్ లొ భాగంగా అద్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు.. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. సిద్ధవటం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన స్థాయికి దిగజారి మరమ్మతులకు నోచుకోకుండా అడుగడుగుకి ఓ గుంట గజానికి ఓగొయ్యి అన్నట్లుగా సిద్ధవటంలో రోడ్ల పరిస్థితి ఉన్నదని నిరసన తెలుపుతూ.. శనివారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య జనసైనికుల ఆధ్వర్యంలో ప్లకార్డులను పట్టుకుని ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలైనా కనీసం రోడ్లకు మరమ్మతులు లేకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేనిపోని హామీలను ఇస్తూ.. ప్రజలను మభ్యపెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పరిస్థితిపై సర్కారు మొద్దునిద్ర వీడి నిద్ర మేల్కోవాలి ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని హోష్ టాగ్ తో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు పసుపులేటి కళ్యాణ్, పోలిశెట్టి శ్రీనివాసులు, చెంగల్రాయుడు, తాళ్ళపాక శంకరయ్య, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.