డ్రైనేజీ వ్యవస్థ రిపేర్ విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి

  • జనసేన శేరిలింగం పల్లి ఇంఛార్జి డా, మాధవరెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన శేరిలింగం పల్లి, నియోజవర్గ ఇంచార్ట్ డా. మాధవ రెడ్డి ఆధ్యర్యంలో శుక్రవారం లింగంపల్లి అండర్ పాస్ మరియు చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జీలను సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకుంట్ల తారకరామా రావు గారు ప్రొద్దున లేస్తే హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దలు వాస్తవానికి సామాన్యులు, బీద, బడుగు బలహీన వర్గాల జీవన విధానాల్లో మెరుగు పడటం కోసం అయితే ఎటువంటి కృషి చేయడం లేదు. మన శేరిలింగం పల్లి నియోజక వర్గం నుండి అయితే పన్నుల రూపంలో రాష్ట్రంలో అధిక ఆదాయం మన నియోజకవర్గం నుండి చెల్లిస్తున్నాం, కాని శేరిలింగం పల్లి అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు అయితే కేటాయించటం లేదు. మధ్యతరగతి ప్రజలకు కనీస అవసరాలను తీర్చటంలో కూడా ప్రభుత్వం విఫలమౌతున్నది. లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల ద్వారా రోజుకు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే వర్షాలు వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం
కలుగుతున్నది. ఇదే విషయాన్ని వినతి పత్రాల ద్వారా ఇప్పటికే 4, 5 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినప్పటికీ, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు, వేసవి కాలంలో సైతం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం చూస్తే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న శ్రద్ద ఎంటో తేటతెల్లం అవుతుంది. ఎన్నికల సమయాల్లో కాకుండా ఇటువంటి సమయాల్లో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే గారు నియోజకవర్గం అంతా తిరిగితే ప్రజలు సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. వెంటనే లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల డ్రైనేజ్ వ్యవస్థను రిపేర్ చేయించి, శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచనలు చేయాలని, ఈ సమస్యకు పరిష్కారాలను చూపాలని డిమాండ్ చేసారు. లేని యెడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు బి.అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, పుష్ప, స్వామి మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.