కొణిజేటి రోశయ్య గొప్ప రాజనీతిజ్ఞుడు: నెరేళ్ల సురేష్

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన గుంటూరు జనసేన

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు, తాను చేపట్టిన ప్రతీ పదవికి వన్నె తెచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య అని గుంటూరు అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆదివారం నగర పార్టీ కార్యాలయంలో జరిగిన కొణిజేటి రోశయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో రోశయ్య అధిరోహించిన పదవులు మరే నాయకుడు కూడా పొందలేదన్నారు. ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత రోశయ్యకు మాత్రమే దక్కుతుందని సురేష్ కొనియాడారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు నాయబ్ కమాల్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్ధిక నిపుణుడు రోశయ్య అని అన్నారు. స్వతంత్ర సమరయోధుడు యన్ జీ రంగా ప్రధాన శిష్యుడైన కొణిజేటి రోశయ్య రాజకీయ, వ్యక్తిగత జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని నాయబ్ కమాల్ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ఉపాధ్యక్షుడు చింతా రాజు, ప్రధాన కార్యదర్శిలు సూరిశెట్టి ఉదయ్, చామర్ధి ఆనంద్ సాగర్, యడ్ల నాగ మల్లేశ్వరరావు, వీరమహిళ రాజనాల నాగలక్ష్మి, మెహబూబ్ బాషా, సోమిశెట్టి నవీన్, సుంకే శ్రీను, త్రిపుర, బుడంపాడు రాజు, పుల్లంసెట్టి ఉదయ్, యాట్ల దుర్గ ప్రసాద్, పులిగడ్డ గోపి, తిరుమల శెట్టి కిట్టూ, ఫణి శర్మ తదితరులు పాల్గొన్నారు.