ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్తున్న జనసేన

  • మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ

అరకు నియోజకవర్గం, అరకు వేలీ మండలం, పద్మపురం పంచాయతీ పరిధిలో గల రాణా జిల్లెడ గ్రామంలో ఆదివారం జనసేన బృందం ఆయా గ్రామంలో పర్యటించింది. ముందుగానే ఇంటింటికి జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు జనంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ఆ యొక్క గ్రామాల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. దీనికై జనసేన పార్టీ స్పందిస్తూ ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, కొర్ర బంగార్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే రాష్ట్రంలో ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టవని తెలిపారు. సమస్యల పట్ల గళం విప్పి మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకులను అక్రమంగా కేసులు బనయిస్తూ జైలుకు పంపిస్తుందని తెలిపారు. చేతకానికి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని మీకోసం నిత్యం పోరాడుతున్న జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని వారిని సూచించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు రాజు, అప్పారావు తదితరులతో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.